ఉరవకొండ /కడప:జిల్లా, *బెడదూరు* గ్రామ సమీపాన ప్రకృతి ఒడిలో, పవిత్ర గిరిశిఖరంపై *స్వయంభువుగా వెలసిన ఆపదమొక్కలవాడు, శ్రీ వేంకటేశ్వర స్వామి* వారి సన్నిధి శనివారం నాడు భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. మాలపాటి వంశీయుల ఇలవేలుపుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే అభయహస్తంగా వెలుగొందుతున్న స్వామివారికి భక్తులు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
సూర్యోదయ వేళ.. సుప్రభాత సేవ
ముక్కోటి దేవతలు కొలిచే ఆ వేంకటపతిని మేల్కొలుపుతూ, తెల్లవారుజామునే మంగళకరమైన సుప్రభాత సేవతో ఆలయం ప్రతిధ్వనించింది. గిరి శిఖరాన వీచే చల్లని గాలుల మధ్య, వేద మంత్రోచ్ఛారణల తోడుగా స్వామివారికి నిర్వహించిన అభిషేక పూజలుభక్తుల కళ్లకు విందు చేశాయి. పంచామృతాలతో అభిషేకించబడిన ఆ నీలమేఘశ్యాముని విగ్రహం నుండి వెలువడే దివ్యతేజస్సు భక్తుల మనసులను మైమరిపించింది.
పుష్పాలంకరణలో దివ్య మంగళ స్వరూపం*
అభిషేకానంతరం, స్వామివారిని నయనానందకరంగా *విశేష పుష్పాలతో* అలంకరించారు. రంగురంగుల సుగంధ పరిమళ భరితమైన పూలమాలల మధ్య శంఖుచక్రధారియై దర్శనమిచ్చిన స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భక్తులు గోవిందా.. గోవిందా.." అంటూ తన్మయత్వంతో జయజయధ్వానాలు చేశారు.
ముగిసిన మొక్కుబడులు
ఈ విశేష పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తమ కోర్కెలు తీర్చమని, ఆయురారోగ్యాలు ప్రసాదించమని వేడుకుంటూ భక్తిశ్రద్ధలతో *మొక్కుబడులు* చెల్లించుకున్నారు. భక్తుల కోలాహలం, మంత్రోచ్ఛారణలు, ఘంటానాదాల మధ్య బెడదూరు కొండ క్షేత్రం సాక్షాత్తూ వైకుంఠాన్ని తలపించింది.


