ఉరవకొండ, జూలై 2:
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) రాష్ట్ర మహాసభలు తీర్మానించాయి. ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో నిర్వహించిన రాష్ట్ర మహాసభల్లో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వం 2003 తర్వాత నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయాలని, ప్రస్తుతం అమలులో ఉన్న CPSను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయడం, PRC బకాయిలు చెల్లించడం, పదోన్నతులు కల్పించడం, బదిలీలు నిర్వహించడం, ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం వంటి అంశాలపై తీర్మానాలు చేశారు.
అదేవిధంగా, టెట్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా రంగాన్ని బలోపేతం చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని మహాసభలు అభిప్రాయపడ్డాయి.
ఈ మహాసభల్లో APTF రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
