ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు: విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్

Malapati
0


 

మంగళగిరి:

 తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహానాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు మరియు శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!