స్థానిక శ్రీ శిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో మహిళలు, బాలబాలికల భద్రతే ధ్యేయంగా శనివారం ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంతకల్ డిఎస్పీ శ్రీనివాస్, ఉరవకొండ అర్బన్ ఇన్స్పెక్టర్ మహానంది, మరియు సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ నాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధికారులు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
స్త్రీ రక్ష యాప్:ఆపదలో ఉన్నప్పుడు మహిళలు ఈ యాప్ను ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్గా చూపించారు.
అత్యవసర హెల్ప్లైన్లు: ఏదైనా సమస్య వస్తే వెంటనే డయల్ 100/112* బాలల సంరక్షణ కోసం *1098* మరియు *ఈగిల్ హెల్ప్లైన్ 1972* నంబర్లను సంప్రదించాలని కోరారు.
పోక్సో (POCSO) చట్టం: బాలలపై జరిగే లైంగిక వేధింపుల నిరోధక చట్టం మరియు దాని ద్వారా లభించే రక్షణపై బాలబాలికలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
మహిళలు, బాలికలు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ఆపద సమయాల్లో ఈ సాంకేతికతను, పోలీసు సేవలనూ వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో పాటు ఐసిడిఎస్ అధికారులు, స్థానిక మహిళలు మరియు పెద్ద సంఖ్యలో బాలబాలికలు పాల్గొన్నారు.


