హైదరాబాద్‌లో డిఫెన్స్ ప్రీమియం మద్యం పట్టివేత – రూ.10 లక్షల విలువైన సరకు సీజ్

 TRUE TIMES INDIA
0

 హైదరాబాద్‌లో డిఫెన్స్ ప్రీమియం లిక్కర్ అక్రమ విక్రయాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు పెద్ద చర్య చేపట్టారు. బడాబాబులను లక్ష్యంగా చేసుకుని అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న ముఠాను గుర్తించిన అధికారులు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో మద్యం సీజ్ చేశారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, బెంగళూరు మరియు హర్యానా రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా డిఫెన్స్ ప్రీమియం లిక్కర్‌ను అక్రమంగా హైదరాబాద్‌కు దిగుమతి చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్‌రెడ్డి ప్రధాన పాత్రలో ఉన్నట్లు తేలడంతో ఆయనను అరెస్ట్ చేశారు.

దాడుల సమయంలో సుమారు రూ.10 లక్షల విలువ చేసే డిఫెన్స్ ప్రీమియం మద్యం సీజ్ చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మద్యం సాధారణంగా డిఫెన్స్ క్యాంటీన్‌ల ద్వారా మాత్రమే లభించాల్సి ఉండగా, దాన్ని అక్రమంగా మార్కెట్‌లోకి తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని విచారణలో బయటపడింది.

ఈ ఘటనపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని, ఈ రాకెట్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!