పర్యావరణ దినోత్సవం సందర్భంగా జై కిసాన్ ఫౌండేషన్* నాగమల్లి ఓబులేష్ ఆధ్వర్యంలో, శాంతి ప్రకృతి ఫౌండేషన్ సహకారంతో రైతులకు ఉచితంగా నాణ్యమైన నిమ్మ మొక్కలను పంపిణీ చేశారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు, రైతులకు అదనపు ఆదాయం అందించడం.
ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి రజిని కుమారి జన్మదినాన్ని పురస్కరించుకుని, తల్లి పేరుమీద ఒక మొక్క నాటి సంరక్షించాలనే పిలుపుతో ఆమె స్వయంగా రైతులకు మొక్కలను అందజేశారు.
మొక్కలు నాటడమే కాకుండా, వాటిని బాధ్యతగా పెంచి భూమాతను పచ్చగా మార్చాలని నాగమల్లి ఓబులేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు చరణ్, మనస్వి, అక్రoత్, ఋషి మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


